ఎస్బీఐకి రూ. కోటి జరిమానా
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐపై ఆర్బీఐ కోటి రూపాయల జరిమానా విధించింది. నేరాలను ఎప్పటికపుడు ఆర్బీఐకి తెలియజేయడంలో అలసత్వం వహించినందుకు ఎస్బీఐపై ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఎస్బీఐ నిర్వహిస్తున్న కస్టమర్ల ఖాతాలను ఆర్బీఐ పరిశీలించగా ఈ నిర్లక్ష్యం బయటపడింది. ఒక ఖాతాకు సంబంధించి బ్యాంకు నిబంధనలను పాటించడం లేదని గుర్తించి… షోకాజ్ నోటీసు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరై ఎస్బీఐ వివరణ ఇచ్చింది. వివరణ చూసిన తరవాత బ్యాంకు నిర్లక్ష్యం వాస్తవమేనని గుర్తించి ఎస్బీఐపై ఆర్బీఐ జరిమానా విధించింది.