For Money

Business News

AirIndia: రతన్‌ టాటా ట్వీట్‌

ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి ఎయిర్‌ ఇండియా తమ గ్రూప్‌లోకి చేరడంతో ఆ గ్రూప్‌ ఛైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎయిరిండియాకు తిరిగి స్వాగతం’’ అంటూ ట్వీట్‌ చేశారు. కంపెనీ మాజీ ఛైర్మన్‌ జేఆర్‌డీ టాటా ఎయిరిండియా విమానం నుంచి దిగుతున్న ఫొటోను జత చేశారు.

‘‘ ఒకప్పుడు జేఆర్‌డీ టాటా నాయకత్వంలో ఎయిరిండియా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విమానయాన సంస్థగా ఖ్యాతి గడించింది. ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్‌ వైభవం తీసుకొచ్చేందుకు టాటాలకు మళ్లీ అవకాశం లభించింది. ఈ రోజు జేఆర్‌డీ టాటా మన మధ్యన ఉంటే ఎంతో సంతోషించేవారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వెల్‌కమ్‌ బ్యాక్‌, ఎయిరిండియా!’’ అని రతన్‌ టాటా కామెంట్‌ చేశారు.