For Money

Business News

టాటా కంపెనీలో రాకేష్‌ వాటా పెరిగింది

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝన్ వాలా.. తన ఫేవరేట్‌ కంపెనీ టైటాన్ కంపెనీలో వాటాలు మళ్లీ పెంచుకున్నారు. టైటాన్‌ భవిష్యత్తును ముందే గుర్తించిన కొంత మంది ఇన్వెస్టర్లలో రాకేష్‌ ఒకరు. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికం చివరి నాటికి రాకేష్‌ కుటుంబం వాటా 5.09 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ 2021 త్రైమాసికం నాటికి 3.80 శాతం అంటే 3,37,60,395 షేర్లున్నాయి. దీనిని డిసెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి 4.02 శాతానికి పెంచారు. ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌ వాలాకు కంపెనీలో 1.07 శాతం వాటాఉంది. దీంతో టైటన్ కంపెనీలో వీరి వాటా 5.09శాతానికి చేరింది. ప్రస్తుతం షేరు ధర రూ. 2,618.65. ఈ లెక్కన కంపెనీలో వీరి వాటా విలువ రూ. 11,849.64 కోట్లు అన్నమాట.