For Money

Business News

అంచనాలను మించిన విప్రో పనితీరు

కొద్ది సేపటి క్రితం విప్రో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తన పనితీరును వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ రూ. 19,667 కోట్ల ఆదాయంపై రూ. 2930 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం త్రైమాసికంలో కంపెనీ రూ. 18,252 కోట్ల ఆదాయం ఆర్జించింది. కంపెనీ మార్జిన్‌ కూడా 0.8 శాతం పెరిగి 16.9 శాతం నుంచి 17.7 శాతానికి చేరింది. ఐటీ సర్వీసెస్‌ వ్యాపారం రానున్న త్రైమాసికంలో 2 శాతం నుంచి 4 శాతం పెరగవచ్చని కంపెనీ పేర్కొంది.