1న 5జీ సర్వీస్లు ప్రారంభించనున్న ప్రధాని
అక్టోబర్ 1వ తేదీన దేశంలో 5జీ సర్వీసులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఢిల్లీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ సదస్సును ప్రధాని మోడీ 1న ప్రారంభిస్తారు. ఆసియాలో అతి పెద్ద ఈ వెంట్ అయిన ఈ సదస్సులో 5జీ సేవలను ప్రధాని ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. టెలికాం విభాగం, సెల్లులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI)లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.