For Money

Business News

1న 5జీ సర్వీస్‌లు ప్రారంభించనున్న ప్రధాని

అక్టోబర్‌ 1వ తేదీన దేశంలో 5జీ సర్వీసులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఢిల్లీ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ జరుగనుంది. ఈ సదస్సును ప్రధాని మోడీ 1న ప్రారంభిస్తారు. ఆసియాలో అతి పెద్ద ఈ వెంట్‌ అయిన ఈ సదస్సులో 5జీ సేవలను ప్రధాని ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. టెలికాం విభాగం, సెల్లులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (COAI)లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.