For Money

Business News

పెట్రోనెట్‌ జంప్‌.. ఏపీ టు ఒడిశా

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రైవేట్‌ రంగ కంపెనీలు రావడం అటుంచి రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తరలిపోతున్నాయి. తాజాగా విశాఖ సమీపంలోని గంగవరం రేవు వద్ద తలపెట్టిన ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ప్రాజెక్టును.. కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ఒడిశాకు తరలిస్తోంది. ఆ రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌ రేవు వద్ద ఏటా 45 లక్షల టన్నులు వార్షిక దిగుమతి సామర్థ్యంతో కొత్తగా ఫ్లోటింగ్‌ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది. గంగవరం వద్ద ఏటా 50 లక్షల టన్నుల దిగుమతి సామర్థ్యంతో రూ.4,500 కోట్లతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటుకు పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ 2012లోనే గంగవరం పోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇపుడు గోపాల్‌పూర్‌ పోర్టు వద్ద టెర్మినల్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.