For Money

Business News

ఆగని బాదుడు..

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.64, లీటర్ డీజిల్ ధర రూ.91.07కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.108.86, డీజిల్ రూ.98.80కు చేరుకున్నాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 103.36, డీజిల్ రూ. 94.17, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.23, లీటర్ డీజిల్ ధర రూ. 95.59గా ఉన్నాయి. రెండు రోజులు స్ధిరంగా ఉన్న చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులు మండిపడుతున్నారు.