For Money

Business News

కొనసాగిన పెట్రో బాదుడు

ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్‌ ధరను 35 పైసలు చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. గడచిన ఏడు రోజుల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచడం ఆరోసారి. ఈ ఆరు రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.3.91, డీజిల్‌ ధర రూ.4.10 చొప్పున పెరిగింది. ఇక రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఆటోమేటిగ్గా పెరుగుతోంది. తాజా పెంపుతో పాట్నాల పెట్రోల్‌ ధర రూ.110ను దాటింది.