For Money

Business News

మళ్ళీ పెట్రోల్‌, డీజిల్‌ భారీ బాదుడు

వరుసగా రెండో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. నిన్న పెట్రోల్‌, డీజిల్‌ రేటు లీటర్‌కు 80 పైసలు పెంచగా, ఇవాళ మరో 80 పైసలు పెంచారు. దీంతో రెండు రోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.1.60 చొప్పున పెరిగాయి. ఈ పెరుగుదల రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి ఇంకా అధికంగా ఉంటుంది. ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ. 97.01కి, డీజిల్‌ రూ. 88.27కు చేరగా, ముంబైలో పెట్రోల్ రేటు రూ. 111.67, డీజిల్‌ రేటు రూ. 95.85కు చేరింది.