For Money

Business News

ఆగని పెట్రో బాదుడు

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను ఇవాళ కూడా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలతో పాటు డాలర్‌ కూడా పెరుగుతోంది. లీటర్‌ పెట్రోల్‌ ధరలను 35 చొప్పున, డీజిల్‌ ధరను 37 పైసలు చొప్పున పెంచాయి. ముంబైలో అత్యధికంగా లీటర్‌ పెట్రోల్ ధర రూ. 111.43కు చేరగా, డీజిల్‌ ధర రూ. 102.15కు చేరింది. ఇతర మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్‌ ధర రూ.105 దాటింది. చెన్నైలో ప్రభుత్వ తగ్గింపుతో రూ.102.70కు లభిస్తోంది. పలు నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం రూ.5లకు తగ్గింది.