For Money

Business News

డిస్కౌంట్‌తో లిస్టయిన పే టీఎం

దేశం స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద ఇష్యూ ఇన్వెస్టర్లను నివ్వెరపర్చింది. కనీసం ఇష్యూ ధర వద్ద అంటే.. తమ పెట్టుబడికి రక్షణ ఉంటుందని ఆశించిన వారికి నిరాశ కల్గింది. ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పేటీఎం రూ. 1929 వద్ద లిస్టయింది. ఈ షేర్‌ ఇష్యూ ధర రూ. 2150. అంటే లిస్టింగ్‌తోనే ఇన్వెస్టర్లు 9 శాతం నష్టపోయారు. లిస్టింగ్‌కు సంబంధించి ఇవాళ బీఎస్‌ఈలో జరిగిన కార్యక్రమంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.