For Money

Business News

ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ తొలగింపు

ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన వెంటనే ఆ కంపెనీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ను తొలగించారు. పరాగ్‌తోపాటు ఆ కంపెనీలో ఉన్న ప్రధాన అధికారులందరినీ మస్క్‌ తొలగించారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, లీగల్‌ పాలసీ,ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టే హెడ్‌లను కూడా తొలగించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో కంపెనీ ఎలాన్‌ మస్క్‌ చేతికి వెళ్ళింది. ట్విటర్‌ డీల్‌ నుంచి మస్క్‌ వెనక్కి వెళ్ళగా… మస్క్‌పై ట్విటర్‌ తరఫున పరాగ్‌ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.