AP: ఆన్లైన్లోనే సినిమా టికెట్ల విక్రయం
ఆన్లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సేవా రుసుము టికెట్ ధరపై 2 శాతానికి మించి ఉండకూడదని నిర్దేశించింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించారు. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అన్ని థియేటర్లు, ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి.