For Money

Business News

2100 ఒలెక్ట్రా బస్సులకు ఆర్డర్‌

బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్ల్‌య్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ (BEST) నుంచి 2100 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరాకు ఉద్దేశించిన అతి భారీ అర్డర్‌ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌కు లభించింది. ఈ ఆర్డర్‌ విలువ రూ. 3675 కోట్లు. MEIL గ్రూపు కంపెనీ అయిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ మేరకు బెస్ట్‌ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ను పొందింది. దేశ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే అతి పెద్ద ఆర్డర్‌ కావడం విశేషం. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) / ఒపెక్స్‌ )ప్రాతిపదికన 2100 బస్సులను సరఫరా చేయడమేగాక.. వచ్చే 12 ఏళ్ళ పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బస్సులను వచ్చే 12 నెలలలోగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌, ఈవీ ట్రాన్స్‌ రెండు కంపెనీలు మెగా గ్రూప్‌నకు చెందినవే. ఇప్పటికే బెస్ట్‌ కోసం 40 బస్సులను ముంబైలో నిర్వహిస్తోంది.