For Money

Business News

నైకా షేర్‌ 20 శాతం అప్‌

నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ కామర్స్‌ వెంచర్స్‌ షేర్‌ ఇవాళ 20 శాతం లాభంతో ముగిసింది. గత వారం ఈ షేర్‌ బాగా క్షీణించిన విషయం తెలిసిందే. యాంకర్‌ ఇన్వెస్టర్లకు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ కూడా పూర్తయింది. దీంతో వారాంతంలో బోనస్‌ షేర్లను కంపెనీ ప్రకటించింది. ఒక షేర్‌కు అయిదు షేర్లు బోనస్‌గా ఇచ్చేందుకు కంపెనీ ప్రతిపాదించింది. ఈ కంపెనీ షేర్ల ముఖ విలువ రూ.1 అన్న విషయం తెలిసిందే. ఈ బోనస్‌ షేర్లు పొందేందుకు నవంబర్‌ 3 రికార్డు తేదీగా ప్రకటించింది. అయితే ఈ తేదీని ఇవాళ మార్చి నవంబర్‌ 11గా పేర్కొంది. అంటే వారం రోజులు పెంచింది. దీంతో షేర్‌ 20 శాతం లాభంతో ముగిసింది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 983 కాగా, ఇవాళ అదే ధర వద్ద ప్రారంభమై.. రూ.982.25ని తాకింది. కాని దిగువస్థాయి నుంచి కోలుకుని రూ. 1180.25 శాతం అంటే 20 శాతం అప్పర్‌ సీలింగ్‌ వద్ద ముగిసింది.