For Money

Business News

నెట్‌ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు

ఇంటర్‌నెట్‌ లేకున్నా (ఆఫ్‌లైన్‌) డిజిటల్‌ చెల్లింపులకు అనుమతించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే.దీనికి అనుగుణంగా వాటికి విధివిధానాలను విడుదల చేసింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిసార్లు నెట్‌వర్క్‌ సరిగా లేకపోతే డిజిటల్‌ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఒక్కోసారి ఖాతాదారు బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్‌ అయినా.. వ్యాపారికి చేరడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా అసలు ఇంటర్నెట్‌ లేకున్నా.. ఆఫ్‌లైన్‌ ద్వారానే డిజిటల్‌ చెల్లింపులు జరిపే పద్ధతిని ఆర్‌బీఐ ఆవిష్కరించింది. ఈ ఆఫ్‌లైన్‌ లావాదేవీలను కార్డులు, వాలెట్లు, మొబైల్‌లు తదితరాలతో చేసేందుకు వీలుంది. ఈ లావాదేవీల్లో ఏర్పడే వివాదాలూ అంబుడ్స్‌మన్‌ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.