For Money

Business News

మా వాటా అమ్మడం లేదు…

ఏఐజీ హాస్పిటల్స్‌ ఈక్విటీలో మెజారిటీ వాటా అమ్మేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని ఆ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ డి నాగేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఈ హాస్పిటల్‌లో ప్రమోటర్లతో పాటు క్వాడ్రియా క్యాపిటల్‌ కూడా తన వాటాను అమ్ముతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన వివరణ ఇస్తూ హాస్పిటల్‌ ప్రమోటర్లు తమ వాటాలో తగ్గించుకోవడం లేదని స్పష్టం చేశారు. అత్యంత నాణ్యమైనా, జనానికి అందుబాటులో ఉండే వైద్యం అందించాలన్న తమ లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని నాగేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఈ హాస్పిటల్‌లో క్వాడ్రియా క్యాపిటల్‌కు 30 శాతం వాటా ఉంది. ఒకవేళ ఆ కంపెనీ తన వాటాను అమ్మినా… మెజారిటీ వాటా ప్రమోటర్లకే ఉంటుందన్నమాట. మొత్తానికి హాస్పిటల్‌లో తన వాటాను అమ్మడం లేదని ఈ ప్రకటనతో నాగేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు.