For Money

Business News

చైనా ఫోన్లను నిషేధించం

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్లను భారత ప్రభుత్వం నిషేధించనున్నట్లు సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రూ.12,000లోపు స్మార్ట్‌ఫోన్లను నిషేధిస్తారని జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఈ వార్తలు వస్తున్నా… అధికారికంగా ప్రభుత్వం స్పందించలేదు. అయితే ఇవాళ దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్లను నిషేధించే యోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ. 12,000 లోపు విలువైన ఫోన్లను నిషేధించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది. అఇయతే భారత బ్రాండ్లకు కూడా తగిన స్పేస్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.