For Money

Business News

యధాతథ స్థితి కొనసాగింపు

రెపొ, రివర్స్‌ రెపో రేట్లను ఇపుడున్న స్థాయిలోనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్ణయించింది. మూడు రోజుల చర్చల తరవాత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నిర్ణయానికి వచ్చింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపొ రేటు ఇపుడున్న 4 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం వద్దే కొనసాగనుంది.