For Money

Business News

17300పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికన్నా అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. 17348 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 17346 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 102 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 40 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిన్న ఫలితాలు ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌ ఇవాళ 4 శాతం దాకా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి గెయినర్స్‌లో సన్‌ ఫార్మా టాప్‌లో ఉంది. ఇక సూచీల విషయానికొస్తే నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 0.85 శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి 0.35 శాతం లాభంతో ఉంది. నిన్న చక్కటి ఫలితాలు ప్రకటించిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌ ఫైనాన్స్‌ 8 శాతం లాభంతో ట్రేడవుతోంది. అనేక మంది అనలిస్టులు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ను సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్‌ ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ఉంది.