For Money

Business News

కొనసాగుతున్న ర్యాలీ

స్టాక్‌ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. మిడ్‌ సెషన్‌లో అంటే 12 గంటల ప్రాంతంలో నిఫ్టి దాదాపు వంద పాయింట్లు క్షీణించి 15831 పాయింట్లను తాకింది. యూరో మార్కెట్‌ కూడా భారీ లాభాలతో ప్రారంభం కావడంతో నిఫ్టి మళ్ళీ 15900 స్థాయిని తాకింది. ప్రస్తుతం 187 పాయింట్ల లాభంతో 15886 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి కేవలం నాలుగు షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. సూచీలలో అత్యధికంగా నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ 1.5 శాతం లాభంతో దూసుకుపోతోంది. నిఫ్టి బ్యాంక్‌ మాత్రం స్వల్పంగా క్షీణించి0.76 శాతం లాభంతో ట్రేడవుతోంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో క్లోజయ్యే అవకాశముంది.