17200పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఒక మోస్తరు లాభంతో నిఫ్టి ప్రారంభమైంది.17243ని తాకిన నిఫ్టి ఇపుడు 17197 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 39 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి బ్యాంక్ ఇవాళ కాస్త స్తబ్దుగా ఉంది. నిఫ్టి మిడ్ క్యాప్ పర్లేదు. అర శాతంపైగా లాభంతో ఉంది. నిఫ్టిలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం దాకా లాభంతో ఉంది. సిప్లా, టాటా స్టీల్, హిందాల్కో షేర్లు రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. సన్ ఫార్మా ఒక శాతం నష్టంతో నిఫ్టిలో టాప్ లూజర్గా నిలిచింది. మెట్రో బ్రాండ్స్ అద్భుత ఫలితాలు కారణంగా ఆ షేర్ ఇవాళ రూ. 45 పెరిగింది. వారం రోజుల్లో ఈ షేర్ రూ.80 దాకా పెరిగింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, డిక్సన్ ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. పేటీఎం కూడా రూ.10 పెరిగింది. రిలయన్స్ కూడా రూ.27 లాభంతో ఉంది.