17,200 చేరువలో నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయి లాభాలతోనే నిఫ్టి ప్రారంభమైంది. 17195 గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత ఇపుడు 95 పాయింట్ల లాభంతో 17181 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 47 షేర్లు లాభాల్లో ఉన్నాయి. చాలా షేర్లు నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరగడంతో ఓఎన్జీసీ ఇవాళ టాప్ గెయినర్గా నిలిచింది. దాదాపు అన్ని సూచీలు అర శాతంపైగా లాభంతో ట్రేడ్ అవుతుండటం విశేషం. మిడ్క్యాప్ సూచీలో కూడా కేవలం ఒక్క షేర్ మాత్రం స్వల్ప నష్టంతో ఉంది. ఇవాళ ఆర్బీఎల్ కోలుకుంది కాని…కేవలం 2 శాతం లోపు లాభాలకే పరిమితమైంది.