For Money

Business News

నిమిషాల్లో నష్టాల్లో నుంచి లాభాల్లోకి…

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు హెచ్‌సీఎల్‌ టెక్ ఫలితాలను మార్కెట్‌కు రుచించలేదు. దీంతో నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 18,228 పాయింట్లకు చేరింది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన వార్తలతో ఆటో కంపెనీల షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి టాప్‌ 5 గెయినర్స్‌లో మూడు కంపెనీలు ఇవే. ఆరు శాతంపైగా నష్టంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు టాప్‌ లూజర్‌గా నిలిచింది. నిఫ్టిలో 30 షేర్లు గ్రీన్‌లోఉన్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే 41 పాయింట్ల లాభంతో 18,296 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్షియల్‌ నిఫ్టి సూచీలు అర శాతం లాభంతో ట్రేడవుతున్నా… మిడ్‌ క్యాప్స్‌లో ఎలాంటి ఉత్సాహం లేదు. ఇక నిఫ్టి నెక్ట్స్‌ సూచీ నష్టాల్లో ఉంది. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందుతున్నా… పై స్థాయిలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.