For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

పాకిస్తాన్‌పై భారత్‌ సింధూర్‌ ఆపరేషన్ పూర్తి చేసిన తరవత మార్కెట్లు స్థిరంగా స్వల్పంగా నష్టంతో ప్రారంభమైనా.. వెంటనే కోలుకున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మీడియా సమావేశం తరవాత మార్కెట్లలో స్థిరత్వం వచ్చింది. నష్టాల్లోకి జారుకున్న ప్రతిసారీ మద్దతు లభించింది. చివరి గంటలో కూడా మార్కెట్‌కు మద్దతు అందడంతో నిఫ్టి 35 పాయింట్ల లాభంతో 24414 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా ఇవాళ మిడ్‌ క్యాప్‌ సూచీలు 1.5 శాతం లాభంతో క్లోజ్‌ కావడం విశేషం. అలాగే బ్యాంక్‌ నిఫ్టి నష్టాల్లోకి జారుకోగా, ప్రైవేట్‌ బ్యాంకులు సదరు సూచీని లాభాల్లోకి తెచ్చింది. నిఫ్టి షేర్లలో టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బ్రిటన్‌తో కుదిరిన ఎఫ్‌టీఏ కారణంగా జేఎల్‌ఆర్‌ వాహనాలను తక్కువ సుంకంతో దిగుమతి చేసుకునే అవకాశం ఈ కంపెనీకి దక్కింది. అలాగే జియో ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఏషియన్‌ పెయింట్స్‌ అగ్రభాగాన నిలిచింది. తరువాతి స్థానాల్లో సన్‌ ఫార్మా, బజాజ్‌ ఆటో, ఐటీసీ, గ్రాసిం షేర్లు నిలిచాయి.

Leave a Reply