For Money

Business News

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో నిఫ్టి లాభాల్లో ముగిసింది. మిడ్‌ సెషన్‌లో స్వల్ప ఒత్తిడి వచ్చినా.. దిగువ స్థాయిలో అందిన మద్దతుతో గరిష్ఠస్థాయికి చేరింది. 18175 పాయింట్లను తాకిన తరవాత 18145 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 133 పాయింట్లు క్షీణించింది. విచిత్రమేమిటంటే ఇవాళ్టి ర్యాలీకి బ్యాంకులు దూరంగా ఉండటం. 18000 వరకు నిఫ్టి ర్యాలీలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాయి. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి 18 పాయింట్ల నష్టంతో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు ఒక శాతం లాభంతో ముగిశాయి. దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ ఆరు శాతం పైగా పెరగడం విశేషం. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఏడు శాతం లాభంతో ముగిసింది.