For Money

Business News

17,900పైన ముగిసిన నిఫ్టి

లాభాలు స్వీకరించినా, నిఫ్టి 17,900పైన ముగిసింది. దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల మధ్య మూరత్‌ ట్రేడింగ్ జరిగింది. 17,935 వద్ద ప్రారంభమైన నిఫ్టి చివర్లో 17,900 స్థాయికి క్షీణించినా 17,916 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 98 పాయింట్ల లాభంతో ముగిసింది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అత్యధికంగా మిడ్‌ క్యాప్‌ సూచీ 0.72 శాతం లాభంతో ముగిసింది. దీపావళి తరువాతి రోజు గుడిపడ్వా పండుగ ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు. కాబట్టి మార్కెట్‌ వచ్చే సోమవారం ప్రారంభమౌతుంది.