ఆటుపోట్లు…అయినా లాభాల్లోనే…
వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ప్రభావం ఇవాళ మార్కెట్లో బాగా కన్పించింది. నిఫ్టి పలు మార్లు హెచ్చతగ్గులకు లోనైంది. ఉదయం 17066 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి 17,105ని తాకింది. అక్కడి నుంచి మిడ్ సెషన్లోపల ఇవాళ్టి కనిష్ఠ స్థాయి17,015 పాయింట్లకు క్షీణించింది.కాని అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి… మిడ్ సెషన్ తరవాత ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,118కి చేరింది. తరవాత కూడా పలు ఆటుపోట్లకు గురైనా 17,072 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 117 పాయింట్లు పెరిగింది. ఇతర సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నిఫ్టి బ్యాంక్ కేవలం అర శాతం లాభపడగా, నిఫ్టి నెక్ట్స్ , మిడ్ క్యాప్ సూచీలు ఒక శాతం లాభంతో ముగిశాయి. దివీస్ ల్యాబ్ మరోసారి రూ. 4500 దిగువకు వచ్చింది.ఇక మిడ్ క్యాప్ జీ టీవీ కౌంటర్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఇవాళ షేర్ మరో 3 శాతం నష్టంతో రూ.338 వద్ద ముగిసింది.