For Money

Business News

58 శాతం పెరిగిన నికర లాభం

రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన మీడియా హోల్డింగ్‌ కంపెనీ నెట్‌వర్క్‌ 18 మార్చితో ముగిసిన మూడు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది.గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 58 శాతం పెరిగి 61.6 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం కూడా 14.6 శాతం పెరిగి రూ. 1621 కోట్లకు చేరింది. న్యూస్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌తో పాటు డిజిటల్‌ రెవెన్యూ ఆపరేషన్స్‌ బాగా రాణించినట్లు కంపెనీ పేర్కొంది. అడ్వర్టయిజ్‌మెంట్ రెవెన్యూతోపాటు యూజర్స్‌ సంఖ్య బాగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. డిజిటల్‌ రంగంలో ప్రధాన సంస్థగా మారడమే లక్ష్యంగా కంపెనీ ముందడుగు వేస్తోందని కంపెనీ ఛైర్మన్‌ ఆదిల్‌ జైనుల్‌భాయ్‌ వెల్లడించారు.