For Money

Business News

నెట్‌వర్క్‌ 18కు నికర నష్టం

మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.62 కోట్ల నికర లాభం ప్రకటించిన రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీ నెట్‌వర్క్‌ 18 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో రూ. 10 నికర లాభం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో మూడు స్పోర్ట్స్‌ ఛానల్స్‌ను ప్రారంభించామని, దీంతో కంపెనీ లాభదాయకత పై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఆదాయం మాత్రం పది శాతం పెరిగి రూ. 1340 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలోనే కంపెనీ ఐపీఎల్‌ డిజిటల్‌ హక్కులు పొందిన విషయం తెలిసిందే. టీవీ ఛానల్స్‌ నుంచి ఆదాయంలో పెద్దగా వృద్ధి లేదని అయితే డిజిటల్‌ డివిజన్‌ నుంచి ఆదాయం బాగా పెరిగిందని కంపెనీ పేర్కొంది.