For Money

Business News

అదానీ పోర్టులో గంగవరం పోర్టు విలీనం

ఇటీవల వంద శాతం వాటా కొనుగోలు చేసిన గంగవరం పోర్టును అదానీ పోర్టులో విలీనం చేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ రెండు కంపెనీల విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఇవాళ ఆమోదం తెలిపింది. గంగవరం పోర్టు ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు నుంచి మెజారిటీ వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ వార్‌బగ్‌ పింకస్‌ నుంచి కూడా 31.5 శాతం వాటా కొనుగోలు చేసింది. మిగిలిన ప్రభుత్వ వాటా 10.4 శాతంను కూడా కొనుగోలు చేయడంతో మొత్తం వంద శాతం వాటా అదానీ గ్రూప్‌ చేతికి వచ్చింది. ఏపీ ప్రభుత్వ వాటాను రూ.645 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.