ఎన్సీసీ లాభం రూ.50 కోట్లు
జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఎన్సీసీ లిమిటెడ్ రూ.2,083.21 కోట్ల టర్నోవర్ను ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం టర్నోవర్ రూ.1,328.71 కోట్లతో పోలిస్తే 57 శాతం పెరిగింది. కన్సాలిడేటెడ్ నికర లాభం కూడా రూ.15.58 కోట్ల నుంచి రూ.49.95 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికానికి రూ.3,171 కోట్ల ఆర్డర్లు లభించాయని.. దీంతో జూన్ చివరి నాటికి మొ త్తం ఆర్డర్లు రూ.39,087 కోట్లకు చేరాయని ఎన్సీసీ వెల్లడించింది. కంపెనీ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.1,912 కోట్ల టర్నోవర్పై రూ.51.68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.