కొనసాగుతున్న ర్యాలీ

వాల్స్ట్రీట్లో ర్యాలీ కొనసాగుతోంది. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జొరొమ్ పావెల్ను తొలగించే అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుకడుగు వేయడంతో పాటు చైనా దిగుమతులపై సుంకాలను ట్రంప్ తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు రావడంతో… వాల్స్ట్రీట్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. నాస్డాక్ 2.85 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.8 శాతం, డౌజోన్స్ 1.19 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిన్న ఫలితాల తరవాత 5 శాతం పెరిగిన టెస్లా, ఇవాళ కూడా మరో 5 శాతం పెరిగింది. అమెజాన్, ఎన్విడియా షేర్లు కూడా ఇదే స్థాయిలో లాభాల్లో ఉన్నాయి. డాలర్ స్వల్పంగా పెరిగింది. దీంతో క్రూడ్ స్వల్పంగా క్షీణించింది. అయితే బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. నిన్న 3500ని టచ్ చేసిన ఔన్స్ బంగారం ధర ఇవాళ 3311 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఒక్క రోజే మూడు శాతంపైగా నష్టంతో ఉంది. అయితే వెండి మాత్రం రెండు శాతంపైగా లాభంతో ఉండటం విశేషం.