టెక్, ఐటీ షేర్లు ఢమాల్
వడ్డీ రేట్ల భయం స్టాక్ మార్కెట్లను వెంటాడుతోంది. పదేళ్ళ అమెరికా ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ రెండేళ్ళ గరిష్ఠానికి చేరాయి. దీంతో కరెన్సీ మార్కెట్లో డాలర్ పెరిగింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 96కి దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో టెక్, ఐటీ షేర్ల సూచీ నాస్డాక్ 2.5 శాతం నష్టంతో ప్రారంభమైంది. అలాగే ఇతర సూచీలు కూడా. ప్రస్తుతం నాస్డాక్ 2 శాతం, డౌజోన్స్ 1.2 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఈ ఏడాది మూడుకు బదులు నాలుగుసార్లు వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే జులైకల్లా ఫెడ్ బ్యాలెన్స్ను తగ్గించనున్నారు. ఈ ఏడాది అమెరికా ట్రజరీ బాండ్ ఈల్డ్స్ కనీసం 0.5 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో షేర్ మార్కెట్లో మరింత పతనం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.