For Money

Business News

చివరి రోజున గట్టెక్కిన ఎఫ్‌పీఓ

వోడాఫోన్‌ ఐడియా కంపెనీ ప్రారంభించిన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) చివరి రోజున గట్టెక్కింది. రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉన్నా… ఇతర ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. మొత్తంమ్మీద ఎఫ్‌పీఓ 6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇందులో క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఇన్వెస్టర్ల కోటా ఏకంగా 19.3 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ కావడం విశేషం. ఇన్వెస్టర్ల నుంచి రూ. 15000 కోట్ల సమీకరణకు వచ్చిన వోడాఫోన్‌ ఐడియా ఎఫ్‌పీఓ ఇవాళ ముగిసింది. 25వ తేదీన ఎఫ్‌పీఓ షేర్లు లిస్టవుతాయి. రేపు షేర్ల అలాట్‌మెంట్‌ ఉంటుంది. ఎల్లుండి అలాట్‌మెంట్‌ కానివారికి డబ్బులు వెనక్కి వేస్తారు. 25న లిస్టింగ్‌ ఉంటుంది. ఒక్కో షేర్‌ రూ. 10 నుంచి రూ. 11 శ్రేణికి కంపెనీ షేర్లను ఆఫర్‌ చేసింది. షేర్‌ ముఖ విలువ రూ. 10

Leave a Reply