For Money

Business News

ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌

టాటాల హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ అధినేత అయిన ఎన్ చంద్రశేఖరన్‌ ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా జీఐసీ మాజీ సీఎండీ అలైజ్‌ జీ వర్గసీ వైద్యన్‌ నియమితులయ్యారు. ఈ నియామకాలకు ఎయిర్‌ ఇండియా బోర్డు ఆమోదం తెలిపింది. ఛైర్మన్‌ నియామకం పూర్తవడంతో ఇతర కీలక పోస్టుల భర్తీ చాలా వేగంగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్త సీఈఓ కోసం వేట స్పీడు అందుకునే అవకాశముంది.