For Money

Business News

మారుతి EV రెడీ అవుతోంది…

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) నుంచి తొలి ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్(ఈవీ) రెడీ అవుతోంది. ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్స్‌తో క‌లిసి గ్లోబ‌ల్ మిడ్ సైజ్ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీని మారుతి సుజుకి అభివృద్ధిచేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారుకి వైవై8 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కారును విదేశాలకు కూడా ఎగుమతి చేసేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. గుజరాత్ ప్లాంట్లలో తయారు చేస్తున్న ఈ కారుకు సంబంధించి అనేక అంశాలు ఇపుడు మీడియాలో వస్తున్నాయి. …వైవై8 4.2 మీటర్ల పొడవైన బాడి, పొడవైన 2,700 మీ.మీ వీల్ బేస్ తయారవుతున్న ఈ కారులో 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 138 హెచ్‌పీ మోటార్ ఉంటుంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కి.మీ. ప్రయాణం చేయొచ్చు. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 170 హెచ్‌పీ మోటార్ గల మోడల్ కారు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. 2025లో ఈ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ మార్కెట్లోకి రావొచ్చు. ఈ కారు ధ‌ర రూ.13-15 ల‌క్షలు ఉంటుంద‌ని అంచ‌నా.