For Money

Business News

మహీంద్రా మెడికల్‌ కాలేజీ?

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అక్కడి భారత మెడికల్‌ స్టూడెంట్స్‌ బాధలు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వివిధ దేశాల్లో మెడిసిన్‌ చదువుతున్న భారత విద్యార్థులపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక కథనం రాసింది. ఆ కథనానికి స్పందిస్తూ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా… తమ గ్రూప్‌ కూడా మెడికల్‌ కాలేజీ పెట్టే అంశాన్ని పరిశీలిస్తుందని అన్నారు. మనదేశంలో వైద్య కళాశాలల కొరత ఉందనే విషయం తనకు తెలియదని ఆయన ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో మహీంద్రా గ్రూప్‌కు మహీంద్రా యూనివర్శిటీ ఉంది. అదే క్యాంపస్‌లోనే మెడికల్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నారీని మహీంద్రా కోరారు.