For Money

Business News

మహారాష్ట్రలో వ్యాట్ తగ్గనుంది

మహారాష్ట్రలో పెట్రోల్‌, డీజిల్ రేట్లు తగ్గనున్నాయి. వీటిపై వ్యాట్‌ను తగ్గించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన తరవాత ఆయన సభలో మాట్లాడారు. త్వరలోనే జరిగే కేబినెట్‌ భేటీలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన తరవాత వ్యాట్‌ తగ్గించమని కేంద్రం రాష్ట్రాలను కోరింది. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గించాయి. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలు పెంచలేదు. ఇపుడు మహారాష్ట్ర కూడా తగ్గించనుంది.