For Money

Business News

పేదలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌..

రాష్ట్రంలోని పేదలు, బీపీఎల్‌ కుటుంబాలతో పాటు ఉజ్వల్‌ పథకం లబ్ధిదారులకు రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తామని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. వీరిలో అర్హుల జాబితాను తాము తయారు చేస్తామని.. వారికి రూ. 1040 బదులు రూ. 500లకు గ్యాస్‌ సిలెండర్‌ సరఫరా చేస్తామని… మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రానున్న బడ్జెట్‌లో ప్రకటిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రూ. 500లకు గ్యాస్‌ సిలెండర్‌ను సరఫరా చేస్తామని అన్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో గెహ్టాట్‌ ఈ ప్రకటన చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సగం ధరకే అందజేస్తామన్నారు.