For Money

Business News

ఎల్‌ఐసీ – కొత్త కనిష్ఠ స్థాయికి

మార్కెట్‌ పరుగులు తీస్తుంటే.. కొత్త కనిష్ఠ స్థాయివైపు ఎల్‌ఐసీ షేర్‌ పరుగులు తీస్తోంది.ఇవాళ ఉదయం నిఫ్టి 16350 ప్రాంతానికి చేరితే.. ఎల్‌ఐసీ షేర్‌ రూ.803.65ని తాకింది. ఈ లెక్కన లిస్టింగ్‌ తరవాత ఎల్‌ఐసీ మార్కెట్‌ రూ. 85000 కోట్లకుపైగా తగ్గింది. ఈ షేర్‌ను రూ. 949లకు కంపెనీ ఆఫర్‌ చేసింది. రీటైల్‌ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ ధర కూడా 903, పాలసీదారులకు రూ.889కి ఆఫర్‌ చేశారు. అయితే ఇవాళ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6 లక్షల కోట్ల నుంచి రూ. 5.12 లక్షల కంటే దిగువకు వచ్చేసింది. ఏ స్థాయిలోనూ షేర్‌కు మద్దతు అందడం లేదు. దీంతో ఇన్వెస్టర్లు నష్టాలతో బయటపడుతున్నట్లు తెలుస్తోంది.