For Money

Business News

మరో 3 శాతం లాభం

ఎల్‌ఐసీ షేర్‌లో ఆసక్తి కన్పిస్తోంది. కంపెనీలో సమూల మార్పులకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను భారీగానే కొంటున్నారు. ఈ షేర్‌ 4 శాతం పైగా పెరగ్గా… డెలివరీ శాతం 45 పైనే ఉంది. ఇవాళ ఎల్‌ఐసీ షేర్‌ మరో 3.2 శాతం పెరిగి రూ. 720ని తాకింది. ఎల్‌ఐసీలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను విలీనం చేయడంతో పాటు.. ప్రైవేట్‌ రంగం నుంచి సీఈఓను నియమిస్తారన్న వార్తలతో ఈ షేర్‌ సెంటిమెంట్‌ మెరుగుపడింది. ఈ కౌంటర్‌లో భారీగా వ్యాపారం కూడా జరుగుతోంది. దీంతో ఈ షేర్‌ నవంబర్‌ 23వ తేదీ నుంచి క్రమంగా ప్రతిరోజూ పెరుగుతూ వస్తోంది. నవంబర్‌ 23న ఈ షేర్‌ రూ. 620ని తాకింది. అక్కడి నుంచి 20 రోజుల్లో అంటే 14 సెషన్స్‌లో ఈ షేర్ రూ. 100 పెరిగింది.