For Money

Business News

ఉత్పత్తికి విఘాతం లేదు

తమ ప్లాంట్‌లో ప్రమాదం జరిగినా.. ఉత్పత్తికి ఎలాంటి విఘాతం లేదని లారస్‌ ల్యాబ్‌ పేర్కొంది. నిన్న వైజాగ్‌లోని ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చనిపోయిన విషయం తెలిసిందే. వైజాగ్ సమీపంలోని పరవాడ వద్ద కంపెనీకి ఏపీఐ తయారీ యూనిట్‌ ఉంది.ఈ ప్రమాదంలో గాయపడిన ఓ కంపెనీ ఉద్యోగికి చికిత్స అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదం వల్ల ప్లాంట్‌లో ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని, యధాతథంగా ఉత్పత్తి కొనసాగుతోందని అన్నారు. నిన్న జరిగిన ఘటనపై దర్యాప్తు జరుపుగుతున్న కంపెనీ తెలిపింది.