For Money

Business News

లారస్‌ ల్యాబ్ కలెట్రాకు ఎఫ్‌డీఏ ఆమోదం

హైదరాబాద్‌కు చెందిన లారస్‌ ల్యాబ్‌ (Laurus Labs) తయారు చేసిన హెచ్‌ఐవీ డ్రగ్‌ కలెట్రా ట్యాబ్లెట్లకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఫుడ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA)ఆమోదం లభించింది. కంపెనీ ఇన్వెస్టర్లకు ఇదొక శుభవార్త. ఈ షేర్‌ నిన్న రూ. 602 వద్ద ముగిసింది. ఇంతకు మునుపు ఈ షేర్‌ క్షీణించి రూ. 500 ప్రాంతంలో నిలదొక్కుకుంది. ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని చాలా మంది అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఈ షేర్‌ ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ.724. మళ్ళీ ఈ స్థాయిని లారస్‌ ల్యాబ్‌ అందుకుంటుందని అనలిస్టుల అంచనా.