For Money

Business News

IT Returns : ఒక్కరోజే 53.98 ల‌క్షలు

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రా (2021-22) నికి ఐటీ రిట‌ర్న్‌లు దాఖ‌లు చేయ‌డానికి గడువు నిన్నటితో ముగిసింది. ఒక్కరోజే రాత్రి 8 గంట‌ల స‌మ‌యానికి 53,98,348 మంది ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసినట్లు ఐటీ విభాగం ట్వీట్‌ చేసింది. ఏడు గంట‌ల నుంచి ఎనిమిది గంట‌ల్లోపు 4,95,505 మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారు.
ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు పొడిగించేది లేద‌ని ఆదాయం ప‌న్ను విభాగం ఇప్పటికే స్పష్టం చేసింది. డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ఐటీఆర్‌లు దాఖలు చేయొచ్చు. అయితే, వారు చెల్లించే ఆదాయం ప‌న్నుపై ఒక‌శాతం వ‌డ్డీ అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప‌న్ను ప‌రిమితికి లోబ‌డి ఉన్న వారికి మాత్రం లేట్ ఫీజు వ‌ర్తించ‌దు.