For Money

Business News

డల్‌గా లిస్టయిన టీఎంబీ

తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (టీఎంబీ) లిస్టింగ్‌ చాలా డల్‌గా సాగింది. ఈ బ్యాంక్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ధర రూ. 510 కాగా.. ఇవాళ రూ. 495 వద్ద లిస్టయింది. రూ. 487కి పడిన వెంటనే మద్దతు అందడంతో రూ. 519ని తాకింది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 508 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌లో బ్యాంకింగ్‌ షేర్లకు ఇపుడు మంచి డిమాండ్‌ ఉండటంతో క్లోజింగ్‌కల్లా ఈ కౌంటర్‌లో ఆకర్షణీయ లాభాలు వస్తాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ బ్యాంక్‌ స్థిరంగా వృద్ధి బాటలో నడుస్తోంది. క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించడంతో మరింత మూలధనం అందుబాటులోకి వచ్చింది. స్వల్ప కాలానికి ఈ షేర్లు ఓ మోస్తరు లాభాలు ఇచ్చినా.. దీర్ఘకాలానికి మంచి మంచి లాభాలు ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.