20 శాతం జంప్
నిన్న అద్భుత ఫలితాలు ప్రకటించిన కర్ణాటక బ్యాంక్ షేర్ మార్కెట్లో గట్టి మద్దతు లభించింది. ఇవాళ ఓపెనింగ్లోనే ఈ షేర్ రూ. 111.60ని తాకింది. 20 శాతం పెరిగిన తరవాత ఇపుడు రూ. 109.55 వద్ద 17 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ షేర్ క్రితం ముగింపు రూ. 93.90. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆల్ టైమ్ హై నికర లాభం ప్రకటించింది. మూడు నెలల్లో బ్యాంక్ రూ. 411 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 228 శాతం పెరిగింది. బ్యాంక్ టర్నోవర్ రూ. 41,505 కోట్లకు చేరింది. ఎన్పీఏలకు కేటాయింపులు భారీగా తగ్గడంతో కంపెనీ నికరలాభం భారీగా పెరిగింది.