For Money

Business News

వైజాగ్‌ స్టీల్‌ రేసులో జిందాల్‌

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు నవీన్‌ జిందాల్‌ గ్రూప్‌ కంపెనీ జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (JSPL) కూడా ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీఆర్‌ శర్మ ధృవీకరించారు. ఇప్పటికే లక్ష్మీ మిట్టల్‌ నాయకత్వంలోని ఆర్సెలార్‌ గ్రూప్‌, టాటా గ్రూప్‌ కూడా ఆసక్తితో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కొనేంఉకు ఆసక్తిగా ఉన్నాయి. నీలాచల్‌ ఇస్పాత్‌ కోసం జేఎస్‌పీఎల్‌ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే అది టాటా గ్రూప్‌ కంపెనీకి దక్కింది. దీంతో వైజాగ్‌ స్టీల్‌పై దృష్టి పెట్టారు. ఒడిశాలోని ఎన్‌ఎండీసీ ప్లాంట్‌ నాగర్నార్‌ కూడా కొనేందుకు జేఎస్‌పీఎల్‌ రెడీ అవుతోంది.