For Money

Business News

మా ఆయన అమాయకుడు

ఢిల్లీ మద్యం స్కామ్‌లో చేతులు మారినట్లుగా చెబుతున్న నగదు తమ విమానాల్లో రవాణా చేయలేదని జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ యజమాని కనికా రెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ విమానాల్లో నగదు లేదా మద్యం రవాణా చేయలేదని… రవాణా చేసినట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలని ఆమె అన్నారు. తన భర్త శరత్‌ చంద్రా రెడ్డి కూడా అమాయకుడని, ఆయన పాత్ర ఉన్నట్లు సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే శరత్‌ చంద్రా రెడ్డి ఈడీ కస్టడీలో ఉండగా, ఇవాళ కనికా రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.