For Money

Business News

డిష్‌ టీవీ ఛైర్మన్‌ రాజీనామా

డిష్‌ టీవీ కంపెనీ ఛైర్మన్‌, ప్రమోటర్‌ అయిన జవహర్‌ లాల్‌ గోయెల్‌ కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నుంచి వైదొలిగారు. ఈనెల 26వ తేదీన కంపెనీ సర్వ సభ్య సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆయన ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే ఏజీఎంలో ఆయన ఛైర్మన్‌ పదవికి పోటీ చేయరని స్పష్టమైంది. ప్రస్తుతం కంపెనీలో ఎస్‌ బ్యాంక్‌కు 24 శాతం ఉంది. కంపెనీ బోర్డు పునర్‌ వ్యవస్థీకరణ కోసం ఛైర్మన్‌గా రాజీనామా చేయాల్సిందిగా ఎస్‌ బ్యాంక్‌ కోరింది. ఈ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. మొత్తానికి బోర్డు నుంచి జవహర్‌ రాజీనామాతో కంపెనీ పునర్‌ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. జవహర్‌ రాజీనామాతో మార్కెట్‌లో కంపెనీ షేర్‌ 10 శాతం పెరిగింది. అప్పర్‌ సర్క్యూట్‌లో ఈ షేర్‌ రూ. 16.80 వద్ద ముగిసింది.